రోడ్ ప్రమాదాల నివారణకు వాహన దారులు నిర్ణీత వేగం లో ప్రయాణించాలి అని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏ సి పి జి.శంకర్ రాజు అన్నారు.మంగళ వారం బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇస్పెక్టర్ సాయి ప్రకాష్ గౌడ్,పీ సీ ఎమ్ డీ. అయాన్ , హెచ్ జి కృష్ణ అబ్దుల్ మజీద్ ఖాన్ మరియు వెంకటేష్ పిఎస్ బంజారా హిల్స్ L &O ట్రాఫిక్, PS పరిమితిలో హయత్ ప్రాక్ హోటల్ బంజారా హిల్స్ హైడ్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం హోటల్ ఆవరణలో మేనేజర్ రాము సహకారంతో, హోటల్ సిబ్బంది .60 మంది సభ్యులతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలు,రోడ్ పైన ప్రయాణించే సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏ సి పీ .జి.శంకర్ రాజు వివరించారు.రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలను వివరించి వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు.రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహనను ppt ప్రజెంటేషన్తో వివరించారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, ఐక్యత, సమయాన్ని వృథా చేయకూడదని వివరించారు.
