రాష్ట్రంలో రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్) ను మరింత పటిష్టం చేస్తామని రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్)తెలంగాణ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ ఫయాజ్ అన్నారు. ఆదివారం బేగంపేటలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ ను అన్ని జిల్లాలు మండలాలు మున్సిపాలిటీలు గ్రేటర్ పరిధిలో బూతు స్థాయి వరకు పటిష్టం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.. ఇటీవల మహమ్మద్ ఫయాజ్ కేంద్ర కాంగ్రెస్ నాయకులు కే సి వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్ లను కలసి తెలంగాణా రాష్ట్రం లో పార్టీ పటిష్టత తో పాటు రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్)ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు త్వరలో రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో పర్యటించ నున్నట్లు ఆయన తెలియ జేశారు.ప్రతి జిల్లా కేంద్రం లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.అన్ని జిల్లాల్లో రాహుల్ ప్రియాంక గాంధీ (కాంగ్రెస్ ) కమిటీల నిర్మాణం
పై దృష్టి సారిస్తున్నారు.



