తాళ్లూరు ఇంచార్జి ఎంపీడీవోగా హనుమంతునిపాడు ఈవోఆర్డీ దారా హనుమంతరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న ఎంపీడీవో కె.సుందరామయ్య విద్యాభ్యాసశిక్షణ నిమిత్తం సెలవు పై వెళ్లారు. ఆయన స్థానంలోహనుమంతునిపాడు ఈవోఆర్డీ దారా హనుమంతరా వునుఎంపీడీవోగా పూర్తి అధనపు బాధ్యతలతో నియమించగా గురువారం మద్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. గ్రామపంచాతీల్లోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. స్థానిక ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావును, జడ్పీ టీసీ మారం వెంకటరెడ్డిలను ఎంపీడీవో మర్యాద పూర్వకంగా కలుసుకోగా వారు అభినందనలు తెలిపారు.
