తాళ్లూరు మండలం విఠలాపురం కాలనీలో నూతనంగా ప్రతి
ష్టంచనున్న వైకుంఠరామాలయ ప్రతిష్టా మహోత్సవం సందర్భముగా శుక్రవారం రుత్వికులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. రుత్వికులు సౌమిత్రి వేణు గోపాలాచార్యులు నేతృత్వంలోని పండితుల బృందం ఉదయం నిత్యవాహన, మూలమంత్రమూర్తి, జలవిశేషహోమాలు, నూతన మూర్తులషోడక కలశఅలంకారం, నిత్యపూర్ణాహుతి, మంగళాశాసనం, సాయంత్రం సమిష్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, పారాయణాదుల జలధివాసం, పూర్ణాహుతి, వంటి పూజా కార్య. క్రమాలు చేపట్టారు. పలువురు దంపతులు కార్యక్రమంలో పాల్గొని పూజలు చేపట్టారు.
