టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగానిలిచివారిఅభ్యుతికి కృషి చేస్తుందని దర్శినియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాధంలో తూర్పుగంగవరం సర్పంచ్ నాగమణి భర్త మృతి చెందగాటీడీపీ పార్టీ సభ్యత్వం వుండటంతో ప్రమాధభీమా కింద రూ. 5 లక్షలు మంజూరుకాగా ఆ నగదు చెక్కును శుక్రవారం దర్శిలోని ఆమె నివాసంలో కుటుంబీకులకు అందజేశారు. ఈసందర్బంగా డాక్టర్ గొట్టిపాటి… మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీకిలేని సభ్యులు టీడీపీకి వున్నారన్నారు. పార్టీ సభ్యులను అండగా నిలిచేం దుకు సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఏదేని ప్రమాధంలో మృతిచెందితే ఆ కుటుంబా నికి ఆర్థికంగా ఆదుకునేందుకు భీమా ద్వారా రూ. 5 లక్షలు అందజేస్తున్నదన్నారు. టిడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం నారాచంద్రబాబునాయుడు, ప్రధానకార్యదర్శి రాష్ట్ర మంత్రి నారాలోకేష్ లు టీడీపీ కార్యకర్తల అభ్యుతికోసం నిరంతరం కృషి చేస్తూ ఆకుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందన్నారు. తూర్పుగంగవరం సర్పంచ్ నాగ మణి కుటుంబానికి తాను అండగా నిలచి వారి అభ్యున్నితికి కృషి చేస్తానని తెలి పారు. ఈ కార్యక్రమంలోదర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్, గ్రామ టీడీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి( చందన), ఉపసర్పంచ్ కాశిరెడ్డి, చాట్ల ఇమ్మానియేల్, గుజ్జుల సుబ్బారెడ్డి, సానెఆంజనేయులు,సూర్యనారాయణతదితరులు పాల్గొన్నారు.
