పేకాట ఆడటం నైతికంగా తప్పు కాదని, సరదాగా సొంత వాళ్లతో ఆడితే నేరంగా భావించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్లో భాగంగా పేకాట ఆడితేనే నేరమని పేర్కొంది. రోడ్డు పక్కన పేకాట ఆడాడనే కారణంతో కర్ణాటకలో హనుమంతరాయప్ప అనే వ్యక్తిని ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచితొలగించడం సరికాదంది. వెంటనే ఆయన సభ్యత్వాన్నిపునరుద్ధరించాలని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.
