తాళ్లూరు మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశా
లకు ప్రభుత్వ నిర్వహించిన కౌన్సిలింగ్ లో ప్రధానోపాధ్యాయులు నియమితులైనారు. బేస్తవారిపేట మండలం గరిజేరుగుళ్ల పాఠశాల హెచ్ఎం కె. వరదారెడ్డి శివరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. దొనకొండ మండలం మల్లంపేట ప్రధానోపాధ్యాయుడు అనంత పద్మనాభ శర్మ లక్కవరం జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా నియమితులయ్యారు. తాళ్లూరు మండలం తూర్పుగంగవరం హెచ్ఎం సీహెచ్. అరుణకుమారి టంగుటూరు మండలం నిడమానూరుకు బదిలీ కాగా ఆమె స్థానంలో దర్శి మండలం పొతకమూరు హెచ్ఎం వైఎ స్సార్ కె. ప్రసాద్ ఇక్కడికి వచ్చారు. ఆయన ఇదే పాఠశాలలో దాదాపు పద్నా లుగు సంవత్సరాలపాటు లెక్కలు మాస్టర్ (ఎస్. ఎ ) గా పనిచేశారు. నూతన ప్రధానోపాధ్యాయుల నియామకంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరింత బలోపేతం అవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు.
