ప్రజల నుండి వచ్చే వివిధ రకాల సమస్యల యొక్క ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం” నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుదిక్కులా నుండి వచ్చిన పిర్యాదుదారులతో అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
ఆయా ఫిర్యాదుల గురించి సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, జాబ్ ఫ్రాడ్, కుంటుంబ సమస్యలు, చీటింగ్ మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, యస్.బి ఎస్సై ఏ ఆంజనేయులు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.


