రైతులు వైబ్ బర్లీ పొగాకు సాగు మానివేసి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని
ఎంపీడీఓ సానికొమ్ము నత్యం కోరారు. మండలంలోని తూర్పుగంగవరం, నాగంబొట్ల పాలెం గ్రామాలలో బుధవారం వ్యవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది నిర్వహించారు. ఎంపీడీఓ నత్యం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు మార్కేట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను వివరించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం, సానో యూరియా ప్రాముఖ్యతను వివరించారు. విఏఏ లు నుప్రజ, ప్రియ, ఐసీఆర్పీ లు కోటి రత్నం, అనంత లక్ష్మి, జాన్ తదితరులు పాల్గొన్నారు.

