పీ.ఎం.ఏ.యూ – 2. అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

ప్రధానమంత్రి ఆవాస్ యోజన – 2 (పీ.ఎం.ఏ.యూ – అర్బన్) పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘ అవగాహన – 2025 ‘ పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ సోమవారం గ్రీవెన్స్ హాలులో ఆవిష్కరించారు. ఈ పథకం కింద అర్హులైన వారు పొందేందుకు అవకాశం ఉన్న ప్రయోజనాల వివరాలను వారికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ పోస్టర్లను రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారిని కూడా ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నట్లు ఆయన వివరించారు. అర్హులందరూ ఈ పథకం క్రింద ప్రయోజనాన్ని పొందేలా చూడాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయటం, లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా రుణ మేళాలు నిర్వహించటం, పి.ఎం.సూర్యఘర్ – దాని ప్రయోజనాలు కూడా దక్కేలా చూడటం, కొత్తగా నిర్మించిన ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిగేలా పర్యవేక్షించడం కోసం ఈ పోస్టర్లను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, హౌసింగ్ పీ.డీ. శ్రీనివాస ప్రసాద్, టిట్కో డి.ఈ.ఈ. వీరబ్రహ్మచారి, సి ఎల్ టి సి ఆనంద్, ఏ.ఈ.ఈ. మల్లికార్జున రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *