గ్రామాలలో స్వచ్చతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎల్ పీఓ నువార్తమ్మ అన్నారు. మండలంలోని మాధవరం, తూర్పుగంగవరం, దోసకాయల పాడు పంచాయితీలను ఆమె ఎంపీడీఓ అజిత తో కలసి సందర్శించారు. మాధవరంలో చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించారు. న్వచ్ఛ పధంలో బాగంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న పేడ దిబ్బలను చెత్తా చెదారం తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పుగంగవరంలో స్వచ్చ రథం వాహనం ద్వారా డ్రై వేన్ను సేకరించి వారికి కావలసిన నిత్యావసర వస్తువులను అందించే కార్యక్రమాన్ని పరిశీలించారు. తూర్పుగంగవరం, దోనకాయలపాడులలో పలు రికార్డులను పరిశీలించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను ఏర్పడికప్పుడు పూర్తి చేసి ముందంజలో ఉండాలని సూచించారు. డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శులు, నచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

