ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పటల్ ఆధ్వర్యంలో తూర్పుగంగవరం గీతాంజలి హైస్కూల్ ఆవరణలో శనివారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల ప్రముఖ వైద్యులు డాక్టర్ శివ క్రిష్ణ, డాక్టర్ రవీంద్ర రెడ్డి, డాక్టర్ ఆంజనేయులు రెడ్డి లు పాల్గొని 235 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి బిపి, ఘగర్, ఈజీజి, ఎకో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు.



