ముండ్లమూరు మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన మండల జగనన్న సచివాలయ కన్వీనర్ మేడికొండ జయంతి ఆదివారం దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు,తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానన్నారు, ఇప్పటికే అన్ని గ్రామాల్లోని సచివాలయాలు పర్యటించి సచివాలయాల స్థాయిలో కన్వీనర్ లను ఎంపిక చేసామ న్నారు, అదేవిధంగా శంకరాపురం గ్రామంలో నూతనంగా అంగనవాడి కార్యకర్తగా పిచ్చేటి జయంతి, అంగన్వాడి ఆయాగా పిన్నేపి గురువర్ధినలను ఎంపిక చేశారు. వీరు ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాతపూడి మోజేసే రత్నం రాజు, మండల వైసిపి యువ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి, ముండ్లమూరు మాజీ సొసైటీ అధ్యక్షులు బద్రి వెంకటసుబ్బారెడ్డి, పూరి మెట్ల సర్పంచి ఓ గులూరి రామాంజి, ఉలగల్లు సర్పంచి జనమాల నాగేంద్ర పిచ్చయ్య, సోషల్ మీడియా మండల కన్వీనర్ మందలపు లింగారావు, అన్నపురెడ్డి బిక్షాల్ రెడ్డి, గర్నపూడి ప్రసన్నకుమార్, తప్పేట డేవిడ్, తదితరులు పాల్గొన్నారు,
ఎమ్మెల్యేను కలిసిన JCS సచివాలయ మండల కన్వీనర్
19
Feb