దర్శి పట్టణం లో తూర్పుచౌట పాలెంరోడ్డులో రాష్ట్రదళిత సేన ఆఫీసులో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కోటా నాగేంద్రం అధ్యక్షతన దళిత, బడుగు బలహీనవర్గాల బహుజనలాశాజ్యోతి మాన్యశ్రీ కాన్షిరాం 89వ జయంతి సభ జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో కురుగ్రామంలో 1934 మార్చి 15 తారీకున ఆయన జన్మించారని అప్పట్నుండి బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న ఆకృత్యాలను సరిచూసి అంబేద్కర్ వారసుడిగా ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికార దిశగా అడుగులు వేసి కుమారి మాయవతి ముఖ్యమంత్రిగా చేసి రాజ్యాధికారం ఆయుధంగా నిరూపించిన మహానీయుడు మన్యశ్రీ కాన్షిరాం అని ఆయన కొనియాడారు.
ముందుగా కాన్షిరాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
కార్యక్రమంలో గర్నెపూడి ప్రభాకర్, గండి ఇశ్రాయేలు ,కోట,నాగేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.
