తాళ్లూరు మండలంలోని బొద్ధి కూరపాడు గ్రామంలో గల శ్రీ గంగా పర్వత వర్ధిని సమేత సోమేశ్వర స్వామి దేవాలయం నందు శుక్రవారం సామూహిక శ్రావణ మాస వరలక్ష్మి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రముఖ పూజారి ఎన్వి కృష్ణారావు ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రత దీక్షలు నిర్వహించారు. రమణయ్య పంతులు సహాయ సహకా రాలతో పలు పూజలు నిర్వహించారు. 60 మంది మహిళా భక్తులు వరలక్ష్మి వ్రతాలలో పాల్గొన్నారు. ఒకరికొకరు వాయనములను ఇచ్చిపుచ్చుకున్నారు.

