ముండ్లమూరు( మండల కేంద్రమైన ముండ్లమూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి ఆటల పోటీలను మంగళవారం ఎంఈఓ జే సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆటలు పోటీలలో ఆసక్తిని పెంపొందించుకొని సోదర భావంతో ఆడాలన్నారు .ప్రధానోపాధ్యాయురాలు ఎల్ మాధవి లత మాట్లాడుతూ క్రీడలు దేహదారుధ్యానికి ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు ఆటలలో బాగా రాణించినట్లయితే ఉద్యోగాలు సాధించవచ్చు అని అన్నారు. షార్ట్ ఫుట్ అండర్ 17 బాలుర విభాగంలో డి అంకం రావు( ఫస్ట్) మారెళ్ళ- జి విట్టర్ బాబు( సెకండ్) మారెళ్ళ- డి అజయ్ కుమార్ (థర్డ్) ఆదర్శ పాఠశాల ముండ్లమూరు– షార్ట్ ఫుడ్ అండర్ బాలికలు కే అమృత వర్షిని( ఫస్ట్) ముండ్లమూరు- కే శ్రావణి (సెకండ్) ఉమామహేశ్వరపురం- జి యోగేశ్వరి( థర్డ్) ఈదర— వాలీబాల్ అండర్ 17 బాలురు సెలక్షన్– జీ వై ఎస్ బాబు వేముల,పి హరి దుర్గాప్రసాద్ వేముల, షేక్ బాషా మారెళ్ళ, ఎన్ జగదీష్ వేముల, విక్టర్ మారెళ్ళ, అంకమ్మరావు మారెళ్ళ, బిజ్జం శివారెడ్డి ముండ్లమూరు, ఎనుముల సాయి చరణ్ ముండ్లమూరు, ఎన్ హేమవర్ధన్ ఉమామహేశ్వరపురం, సిహెచ్ వెంకటశేష్ కుమార్ ఉమామహేశ్వరపురం, జి మోహన్ బ్రహ్మ ఆదర్శ పాఠశాల ముండ్లమూరు, కే మోహన్ ఆదర్శ పాఠశాల ముండ్లమూరు, అండర్ 17 బాలురు- తాతపూడి జెస్సిఫాల్ (ఫస్ట్) ముండ్లమూరు, మైలవరపు భాష సెకండ్– అండర్ 14 ఓ గులూరి గోపీచంద్ (ఫస్ట్) పూరి మెట్ల, తాతపూడి దినేష్ కుమార్( సెకండ్) ముండ్లమూరు విద్యార్థులు చత్తాచాటారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి లు మండల కోఆర్డినేటర్ జి భావన్నారాయణ, సుజాత, రాముడు, విజయ్ కుమార్, తులసి ప్రసాద్,ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, సుబ్బారావులు పాల్గొన్నారు.




