విద్యుత్ శాఖ అకస్మిక దాడులు- అదనపు లోడ్ వాడుతున్న 72 మందికి రూ. 3.45 లక్షలు జరిమాన

తాళ్లూరు మండలంలో విద్యుత్ శాఖ అకస్మిక దాడులు నిర్వహించారు. దర్శి ఈఈ కరీమ్ నేతృత్వంలో 39 మంది అధికారులు . 84 మంది సిబ్బందితో ఆకస్మిక దాడి నిర్వహించారు. 3324 సర్వీసులు తనిఖీ నిర్వహించారు. అదనపు లోడ్ వాడుతున్న 72 మందికి రూ.3.45 లక్షల అపరాధ రుసుం విధించారు. మీటర్లు లేకుండా వాడుతున్న ఇరువురికి మూడు వేలు జరిమాన, విద్యుత్ చౌర్యానికి పాల్పడిన – ఇరువురికి 8వేలు, అనుమతించిన క్యాటగిరిలో కాకుండా ఇతర క్యాటగిరిలో వాడుతున్న వారికి 18వేలు అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఈఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ చౌర్యంపై ఎదైనా సమాచారం ఉంటే 8331019950కు తెలిపి సహకరించాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు -గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో దర్శి, చీమకుర్తి డీఈలో కె పిచ్చయ్య, జీవి క్రిష్ణా రెడ్డి, తాళ్లూరు ఎఈ వీరబ్రహ్మం, పలు మండలాల ఎఈలు, ఎల్ ఐలు లైన్ మెన్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *