కురిచేడు ప్రధాన రహదారిలో శనివారం రవాణశాఖ, ఆర్టీసీ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. మోటారు వాహ నాల తనిఖీ (ఎంవీఐ) అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో అధిక పరిమితితో ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటోలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆటోలకు సంబంధించిన ధ్రువ పత్రాలు, బీమాతో పాటు ఇతర పత్రాలను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేని, అధిక లోడుతో వెళుతున్న ఆటోలకు రూ.30,000 జరిమానా విధించారు. తనిఖీలో పొదిలి ఆర్టీసీ డీఎం సుందరరావు, కంట్రోలర్ రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పలు వాహనాల తనిఖీ – జరిమానా విధించిన ఎంవిఐ రవికుమార్
08
Oct