రైతులు సాగు చేసిన పంటలలో సస్యరక్షణ చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని
ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా వనరుల కేంద్రం సమన్వయ కర్త అన్నపూర్ణ సూచించారు. కొండెపి మండలం ఇలవర, చినకండ్లగుంట గ్రామాలలో మంగళవారం పర్యటించి కంది పంటను పరిశీలించారు. కందిలో వెర్రి తెగుళ్లు, ఆకుతినే పురుగును గమనించి నివారణ చర్యలను రైతులకు వివరించారు. డిఆర్సీ ఎవోలు శైలజా రాణి, విఏఏలు శ్రీనివాస్, మహేష్ లు పాల్గొన్నారు
