ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్లూరి కొండారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చి ఐదు నెలలు పూర్తి కావస్తున్నా నేటికి ఒరిజనల్ మెమోలు ఇవ్వలేదని, పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడో దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తీవ్రంగా విమర్శించారు.
