11వ రోజూ అంగన్ వాడీ ల సమ్మె , ఉదృతంగా కొనసాగింది. ICDS దరిశి ప్రజెక్టు వద్ద ప్రత్యేక శిభిరం వద్ద వైసిపి ప్రభుత్వ మెండి వైఖరి నశించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని , సి.యం డౌన్,డౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలతో మద్యాహ్నం ఒంటి గంటకు పెద్ద ఎత్తున గడియారపు స్థంబం వద్దకు వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ స్థంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ రాస్తారోకో కి అంగన్ వాడీ యూనియన్ నాయకురాలు బాదిరెడ్డి అచ్చమాంబ , చైతన్య భారతి మాట్లాడుతూ వాలంటీర్లకు వేతనాలు పెంచిన ప్రభుత్వం మాకు ఎందుకు పెంచదని , తాళాలు పగల కొట్టిన సచివాలయం వారిపై కేసులు పెట్టినా ఎందుకు అరెస్టు చేయలేదని , ప్రభుత్వ అదికారులు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షలు వెల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ మీ పోరాటం న్యాయం అయిందని సమ్మె పట్టుదలతో 11 రోజుల నుంచి బెదింపులు , వత్తిడిలకు లొంగకుండా తెగువతో పోరాడుతున్న మీకు వ్యవసాయ కార్మికులు అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ రాస్తారోకో కి ప్రజా సంఘాల నాయకులు ఉప్పు నారాయణ , గర్నిపూడి సామ్యేల్ , రంగనాయకులు, బోడపాటి హనుమంతరావు , లక్ష్మీదేవి , సుబ్బమ్మ , నాగమణి , శాంతమ్మ , విశ్వవాణి , అంజమ్మ , పద్మావతి ,అనిత , విశ్రాంతమ్మ పాల్గొన్నారు.







