ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్ ఉంటుందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సతీమణి బాలినేని శబీదేవి అన్నారు. 48వ డివిజన్లో సోమవారం మహిళలతో మమేకం- స్త్రీ శక్తితో శచీదేవి అనే కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సతీమణి బాలినేని శచీదేవి, ఆయన సమీప బంధవులు గౌతమి, భాష్యం, రమణి, మాధవి, రమణమ్మ, కౌసల్య, ప్రసన్న, వెంకట రత్నం, ఘాన్సీ తదితరులు పాల్గొని 48వ డివిజన్లో 60 అడుగుల రోడ్డు, దిబ్బల రోడ్, రమణారావు వైద్యశాల ప్రక్క వీధి, అయ్యన్న వీధి, ఎన్డీఓ కాలనీ, చంద్రయ్య నగర్లో ప్రతి ఇంటికి వెళ్లి మన ఒంగోలు- మన వాసన్న కర పత్రాలను అందించి అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రతి ఒక్కరికి అందించటంలో సీఎం వైఎస్ జగనన్న. బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన కృషిని వివరించారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాలంటే జగనన్న ప్రభుత్వాన్ని కొనసాగించటానికి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ డివిజన్ ఇన్చార్జిలు శేషిరెడ్డి, కోఆర్డినేటర్ నరేంద్ర రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వీర భద్రరావు (వీరు), ఉన్నం జనార్థన్, మాధవ, హనుమా, నాగరాజు, బాదులు, వెంకటేష్, రాము, మధు, నాగేశ్వరావు, సుధాకర్, రాఘవయ్య, జాణా శ్రీను, గురువా రెడ్డి, స్టీఫెన్, జానీ, చిరంజీవి, కొప్పొలు వెంకటేశ్వర్లు, జ్యోతి, మాధవి, మల్లెశ్వరి, ఉషా, శేషమ్మ, అంజమ్మ, రమణమ్మ, మాధవి, శ్రీదేవి, విజయలక్ష్మి వాకా బ్రహ్మా రెడ్డి, డేవిడ్, రామక్రిష్ణా రెడ్డి, సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



