సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి,ఏ ఐసీసీ సభ్యురాలుడా. కోట నీలిమ.సికింద్రాబాద్ లో దానం నాగేందర్ నీ గెలిపించాలని
సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి,ఏ ఐసీసీ సభ్యురాలు డా. కోట నీలిమ పిలుపు నిచ్చారు.కోట నీలిమ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ను గెలిపించాలని రాంగోపాలపెట్ డివిజన్ లోని సిటీ లైట్ హోటల్ నుంచి పాదయాత్ర గాగడప గడపకు వెళ్లి ప్రతి ఓటరు ను కల్సి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. రాష్ర్టంలో 6 గ్యారెంటీ ల అమలు తీరును వివరిస్తూ చేతి గుర్తు కు ఓటు వేయాలి అని నీలిమ ఓటర్లను కోరారు.
ఈ పాదయాత్ర లో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

