బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో బుధవారం సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ,ఏ ఐసీసీ సభ్యురాలు డా. కోట నీలిమ పూజలు చేశారు.ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరూ విజయం సాధించాలన్నారు. ఈ సందర్భంగా. కాంగ్రెస్ నాయకులు కృష్ణయాదవ్డా కోట నీలిమ ని సాదరంగా ఆహ్వానించారు, ఆలయ పూజారి యాదమ్మ సమక్షంలో అమ్మవారికి నీలిమ ప్రత్యేక పూజాలు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సనత్ నగర్ నియోజక వర్గం ఏ బ్లాక్ బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్,సాయికుమార్ ,సలీం, నసీరుద్దీన్ (అడ్డు),మహమ్మద్ అస్లాం ,తదితరులు ఉన్నారు.
