నార్త్ జోన్ ట్రాఫిక్ ఎసీపీగా పనిచేస్తున్న జి శంకర్ రాజును ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టిటిఐ) కి అటాచ్ చేస్తూ శుక్రవారం ట్రాఫిక్ అడిషినల్ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన 2018లో ఎసీపీగా పదోన్నతి పొందారు. కరీం నగర్, జహీరాబాద్ ల కు డీఎస్పీగా 2022 వరకు పనిచేసారు. 2022 నుండి ట్రాఫిక్ టైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగం పేట ఎసీపీగా 2024 పిభ్రవరి వరకు పనిచేసారు. అనంతరం నార్త్ జోన్ ఎసీపీగా పనిచేస్తుండగా ప్రస్తుతం మరలా బేగం పేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సిస్టిట్యూట్ అచాచ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు.

