ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ని త్వరలో కలిసి జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్తామనీ, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏ.పీ.యూ.డబ్ల్యూ.జే) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ లు తెలిపారు. మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన యూనియన్ ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరనున్నట్లు వెల్లడించారు . జర్నలిస్టుల కు సంబంధించిన సమస్యలను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఐ .వి. సుబ్బారావు, చందు జనార్దన్ లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

