బల్కంపేట (హైదరాబాద్), జులై 2,(జే ఎస్ డి ఎం న్యూస్) : బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో గురువారం హుండీ కానుకల లెక్కింపును అధికారులు ఘనంగా నిర్వహించారు. గత 78 రోజులుగా, అంటే ఏప్రిల్ 16, 2026 నుండి జులై 2, 2026 వరకు భక్తులు అమ్మవారికి సమర్పించుకున్న మొక్కుల ద్వారా ఆలయానికి రూ. 93,05,639 (తొంభై మూడు లక్షల ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు) భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ & ఈఓ శ్రీ కె. వినోద్, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ కె. సాయిబాబా గౌడ్ల సమక్షంలో ఈ లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, ఆలయ సూపరింటెండెంట్ శ్రీమతి పి. శ్రీదేవి, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కానుకల లెక్కింపు ముగిసిన అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఆర్ నగర్ శాఖ అధికారుల సమక్షంలో నగదును సురక్షితంగా డిపాజిట్ చేశారు.
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం హుండీ కానుకల లెక్కింపు.. 78 రోజుల్లో రూ.93 లక్షల ఆదాయం
02
Jul