గ్యార్వీ ఉత్సవాల్లో పాల్గొన్న తలసాని.ఆశీర్వాదం ఇచ్చిన మత పెద్దలు………

బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తిలో బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఆరిఫ్ ఆధ్వర్యంలో జరిగిన గ్యార్వి ఉత్సవాలు సనత్
నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట కార్పొరేటర్ టి. మహేశ్వరి శ్రీహరితో కలిసి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు తలసానికి ఆశీర్వాదాలు అందజేశారు. లేక 30ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని తమ బస్తీలో ఖబరస్తాన్ కు స్థలం కేటాయించేందుకు చేసిన కృషిని కొనియాడుతో తలసానికి ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తానని అన్నారు సనత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ అలీ ముస్తఫా జిలాని, టిఆర్ఎస్ నాయకులు టి శ్రీహరి ,శ్రీనివాస్ గౌడ్ ,నరేంద్రరావు ,షేక్ అబ్బాస్ సాబేర్ అలీ , వాహద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *