గ్రామాల్లో చెత్తసంపద తయారీ కేంద్రా
లకు మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుక వస్తున్నామని, పంచాయతీ లకు ఆదాయ వనరుగా వుంటుందని ఒంగోలు డిఎల్.పి.ఓ
పద్మ తెలిపారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని చెత్తసంపద తయారీ కేంద్రంలో తయారు చేస్తున్న వర్మి కంపోస్టు ను ఆమె ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమెమాట్లాడుతూ చెత్తసంపద తయారీ కేంద్రాలు వాడుకలో లేనందున పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నిధులు స మకూర్చి చెత్త సంపద కేంద్రాలకు మరమ్మత్తులు పూర్తి చేయటం జరిగిందన్నారు. గ్రామాల్లోని చెత్తనుఆకేంద్రాలకు తరలించివర్మి కంపోస్టుఎరువును తయారు చేస్తు న్నట్లు తెలిపారు.ఆ వర్మికంపోస్టును విక్రయిస్తే పంచాయతీకి ఆదాయవనరుగా వుంటుందని, గ్రామపంచాయతీల అభివృద్ధికి నిధులు ఉపయోగ పడతాయన్నారు.
గ్రామాల్లో ఇంటిపన్నులను వేగవంతంగా వసూళ్లు చేయాలని, పారిశుద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. గ్రామంలోని సచివాలయంను సందర్శించారు. ఇంటిపన్నులు చెల్లించిన గృహయజమానులకు రసీదులు అందజేశారు. ఈకార్యక్ర
మంలోగ్రామపంచాయతీ కార్యదర్శి టి. అజయ్ కీర్తి తదితరులు పాల్గొన్నారు.



