అమృత్ రైల్వే స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు -రూ. 26.5 కోట్లతో బేగంపేట స్టేషన్ అభివృద్ధి – రూ 25.85 కోట్లతో కరీంనగర్ స్టేషన్ అభివృద్ధి -రూ 25.41 కోట్లతో వరంగల్ స్టేషన్ అభివృద్ధి -బేగంపేట అమృత్ స్టేషన్ లో ఆధునికరించిన సౌకర్యాలను విలేకరులకు వివరించిన దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్

హైదరాబాద్ మే 19(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి ) :
అమృత్ స్టేషన్ల లో ఆధునిక సౌకర్యాలను సోమవారం దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఏ శ్రీధర్ విలేకరులకు వివరించారు. సోమవారం బేగంపేట స్టేషన్లో నూతనంగా ఏర్పాటుచేసిన సౌకర్యాలను విలేకరులకు వివరించేందుకు గైడెడ్ మీడియా టూర్ ను నిర్వహించారు.తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్ , వరంగల్
అమృత్ స్టేషన్లలో అభివృద్ధి చేసిన సౌకర్యాలు మరియు వసతులను వివరించేందుకు గైడెడ్ మీడియా టూర్ ను నిర్వహించామన్నారు.
ఈ సందర్భముగా మీడియా సిబ్బందిని ఉద్దేశించి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బేగంపేట స్టేషన్‌లో అభివృద్ధి చేయబడిన నూతన సౌకర్యాల గురించి మీడియా సిబ్బందికి వివరించారు. నూతనంగా నిర్మించిన స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ప్రాంతం, ప్రవేశ ద్వారం, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్ మొదలైన వాటిని స్వయంగా సందర్శించారు.సుమారు రూ. 12 కోట్ల వ్యయంతో రెండవ ప్రవేశ ద్వారం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని కూడా ఆయన మీడియాకు వివరించారు. హైదరాబాద్ జంట నగర ప్రాంతంలోని ముఖ్యమైన స్టేషన్లలో ఒకటైన బేగంపేట స్టేషన్ సబర్బన్ మరియు నాన్-సబర్బన్ ప్రయాణీకుల అవసరాలను తీరుస్తోందని అన్నారు. ఈ స్టేషన్ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 26.55 కోట్లతో దీనిని పునరాభివృద్ధి చేశారు. ప్రధానమంత్రి ఫిబ్రవరి, 2024 నెలలో పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారన్నరు. అన్ని పనులు విజయవంతంగా పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు . సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ విశాల్ మీడియా సిబ్బందికి స్టేషన్ వివరాలు, అందిస్తున్న సేవలు, రైళ్లు, అందుబాటులో ఉన్న సిబ్బంది మరియు ప్రయాణీకుల సౌలభ్యం కోసం అందించే సౌకర్యాల గురించి వివరించారు.అదేవిధంగా, కరీంనగర్ మరియు వరంగల్ స్టేషన్లలో కూడా మీడియా పర్యటనలు నిర్వహించామన్నారు. కరీంనగర్‌లో, సికింద్రాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ పి. శివ ప్రసాద్, ఇతర రైల్వే అధికారులతో కలిసి స్టేషన్‌లో అభివృద్ధి చేసిన సౌకర్యాల గురించి మీడియా సిబ్బందికి వివరించారు. వరంగల్ స్టేషన్‌లో, సికింద్రాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐ.ఎస్.ఆర్. మూర్తి, ఇతర రైల్వే అధికారులతో కలిసి స్టేషన్‌లో అభివృద్ధి చేసిన సౌకర్యాల గురించి మీడియా సిబ్బందికి వివరించారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా, దాదాపు రూ.2750 కోట్లతో అభివృద్ధి చేయాలని 40 రైల్వే స్టేషన్లను గుర్తించారు. హైదరాబాద్ జంట నగర ప్రాంతంలోని ప్రధాన ప్రదేశంలో ఉన్న ఈ స్టేషన్లలో బేగంపేట రైల్వే స్టేషన్ ఒకటి. రూ.26.55 కోట్లతో పునరాభివృద్ధి కోసం బేగంపేట రైల్వే స్టేషన్‌ను చేపట్టారు. ఈ స్టేషన్ ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది మరియు ప్రస్తుతం దాదాపు 15,000 మంది రైలు వినియోగదారుల రాకపోకలతో దాదాపు 100 రైళ్లను నిర్వహిస్తోంది. ABSSలో భాగంగా, ఆధునిక సౌకర్యాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారన్నారు.
బేగంపేటలో నూతనంగా వెయిటింగ్ హాల్ మరియు బుకింగ్ కార్యాలయంతో పాటు కొత్త స్టేషన్ భవనందివ్యాంగ జన సౌకర్యాలుఆధునిక మరుగుదొడ్లుప్రసరణ ప్రాంతంలో మెరుగుదలలు
సర్క్యులేటింగ్ ఏరియాలో రాక్ గార్డెన్ & చిన్న నీటి ఫౌంటెన్
ముఖభాగం లైటింగ్ స్టేషన్ ప్రాంగణములో ఉద్యానవన రూపకల్పన ప్లాట్‌ఫారమ్‌పై అదనపు కప్పు ఏర్పాటుప్లాట్‌ఫామ్ ఉపరితల మెరుగుదలలు మురుగునీటి శుద్ధి కర్మాగారంర్యాంప్ తో పాటు 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి 2 లిఫ్ట్‌లు మరియు 4 ఎస్కలేటర్లు ప్రయాణీకులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించామన్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటైన కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను రూ. 25.85 కోట్లతో పునరాభివృద్ధికి చేపట్టారు మరియు ప్రధానమంత్రి 2023 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్ కరీంనగర్ మరియు పరిసర ప్రాంతాలలోని రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ స్టేషన్ లో ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది మరియు ప్రస్తుతం 1,000 మంది రైలు వినియోగదారుల రాకపోకలతో 10 రైళ్లను నిర్వహిస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా, ఆధునిక సౌకర్యాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. వరంగల్‌ స్టేషన్ లో కూడా అత్యాధునిక సౌకర్యాలు కల్పించామన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *