విభిన్న ప్రతిభా వంతుల బాలుర వసతి గృహాంలో విద్యార్థుల ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు అర్హలైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ వైద్యశాఖ నుండి దృవీకరణ పత్రం పొంది శారీరిక అంకవైల్యం, పాక్షిక అంధత్వం, వినికిడి లోపం ఉన్న వారు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ 08592-281310 ను సంప్రదించాలని కోరారు.
దివ్యాంగుల వసతి గృహంలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం
12
Jun