పేద,బడుగు వర్గాల ప్రజలకు అండగా నిలుచి వారి అభ్యున్నతికి పాటు పడిన వంగవీటి మోహన్ రంగా ఆశాజ్యోతిగా నిలిచాడని కాపు జేఏసీ రాష్ట్రకన్వినర్ గంటా వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని తూర్పుగం గవరం గ్రామంలో వంగవీటి మోహన్ రంగా 78వజయంతి వేడుకలు శుక్రవారం ఘనంగాజరిగాయి.
వంగ వీటి రంగా చిత్రపటానికి పూల మాలలు వేసి ఘననివాలులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ కాపు జేఏసీ మహిళా కన్వినర్ ఎం.సుజాత, కాపుజెఏసీ మండల కన్వినర్ నారిశెట్టిశ్రీనివాసరావు, తూర్పుగంగవరం మోటార్ ఫీల్డ్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, కాపు జేఏసీ నేతలు తూము రవికుమార్, కనిశెట్టి శ్రీనివాసరావు, మారెళ్ల నరసింహారావు, లక్ష్మీనారాయణ, తోటకృష్ణ, తిరుమలశెట్టి శ్రీను, వంగవీటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
