తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 45 మందిని శంకర కంటి వైద్యశాలకు ఉచిత కంటి శుక్లాల ఆపరేషన్లకు తరలించినట్లు తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పీఎం ఓఓ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైన వారిని శంకర కంటివైద్యశాల బస్సులో ఆపరేషన్లకు తరలించారు.
దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపునకు ప్రత్యేక పరీక్ష ..
దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపునకు మండల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది ఎంపీడీఓ, పోలీస్ ఇతర శాఖల ఉద్యోగులకు పలు పరీక్షలు నిర్వహించారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్లో ఎన్ఐ మల్లిఖార్జున రావు, సిబ్బందికి సోమవారం పరీక్షలు నిర్వహించారు.
