వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి శనివారంమండలంలోని పలు గ్రామాలలో పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తూర్పుగంగవరంలో గుద్దెటి వెంకట రెడ్డి కుమారుడు నుబ్బా రెడ్డి వివాహ దేవుని మొక్కు కార్యక్రమంలో, కొర్రపాటి వారి పాలెంలో సంఘం రాజేష్ వివాహానికి, తురకపాలెంలో కుమ్మిత సుబ్బా రెడ్డి కమార్తె కుమ్మిత వెంకట భవాని వివాహానికి, రమణాల వారిపాలెం గంధం వారి గృహ ప్రవేశానికి హాజరై దీవేనలు, శుభాకాంక్షలు అందించారు. ఆయా కార్యక్రమాలలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, ఐవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి, ముండ్లమూరు జెడ్పీటీనీ రత్నరాజు, మాజీ జెడ్పీటీనీ ఎల్. జి. వెంకటేశ్వర రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, యూత్, స్టూడెంట్, అధ్యక్షులు విష్ణు, శరత్, అశోక్ రెడ్డి, నర్పంచిలు కోట శివలక్ష్మి వెంకట రామి రెడ్డి, వలి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, మాజీ సర్పంచి ఓబులు రెడ్డి, కొండారెడ్డి, గోపాల్ రెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.







