తాళ్లూరు మండలంలో పంచాయతీకార్యదర్శులు లేని మూడు సచివాలయాలకు ఇంచార్జి కార్యదర్శులను నియమిస్తు కార్యాలయ అడ్మిస్ట్రే టివ్ అధికారి సానికొమ్ము సత్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మన్నేపల్లి సచివాలయంకు దోసకాయలపాడు పంచాయతీ కార్యదర్శి కాకర్ల మెలకయ్యను, తాళ్లూరు పంచాయతీ కార్యదర్శి విఠలాపురంపంచాయతీ కార్యదర్శి షేక్ షహనా బేగం, నాగంబొట్లపాలెం పంచాయతీ కార్యదర్శిగా రాభద్రాపురం పంచాయతీ కార్య దర్శి వి.సుబ్బారెడ్డిలను నియమించారు. మన్నేపల్లి, తాళ్లూరు ఇంచార్జి కార్యదర్శి ఐ.వి రమణారెడ్డి సెలవుపై వెళ్లటంతో మూడు పంచాయతీలందు ప్రజలకు పరిపాలన పరంగా ఇబ్బందులు కాకుండా ఇంచార్జిలను నియమించినట్లు అడ్మిసేటివ్ అధికారి తెలిపారు.
మూడు గ్రామ సచివాలయాలకు ఇంచార్జి కార్యదర్శుల నియామకం
14
Aug