చిట్యాల ఆగస్టు 15 జే ఎస్ డి ఎం న్యూస్ :
నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామం లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు.ఆటల పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతి ప్రధానం చేశారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా భారత్ వికాస్ పరిషత్ జివిసిఏ కన్వీనర్ చౌడూరి నరసింహారావు , భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సంపర్క ప్రముఖు రఘు సతీష్ కుమార్ లు హాజరై పతాకావిష్కరణ చేశారు. ఈ వేడుకలలో భారత్ వికాస్ సభ్యులు బొబ్బిలి శివకుమార్ రెడ్డి తో పాటు సభ్యులు పాల్గొన్నారు.



