నిత్యావసర సరఫరా దుకాణం (రేషన్ దుకాణం)లకు ఇక పై నూతన ఈ- పాస్ మిషన్లు వచ్చాయి. పాత ఈ – పాస్ మిషన్లు వెనక్కి తీసుకుని నూతన ఈ- పాస్ మిషన్లు అందించారు. పొదిలి రైస్ ఎం. ఎస్ పాయింట్ వద్ద శనివారం నిర్వహించిన కార్యక్రమంలో దర్శి నియోజక వర్గంలోని దర్శి, దొనకొండ, ముండ్లమూరు, కురిచేడు, తాళ్లూరు మండలాలకు చెందిన డీలర్లకు ఈ -పాస్ మిషన్లు అందించినట్లు తాళ్లూరు మండల డీలర్ల సంఘ అధ్యక్షుడు పిన్నిక రమేష్ తెలిపారు. కార్యక్రమంలో నియోజక వర్గ డీటీ రాధా క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

