పొలం గట్లపై కూడ ప్రత్యామ్నాయ మొక్కలు సాగు చేయటం వలన అదనపు ఆదాయం, చీడ పీడల నివారణ సాధ్యమని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. రామభధ్రాపురంలో శుక్రవారం పంటల సాగును ఆయన పరిశీలించి రైతులకు పలు నూచనలు చేసారు. గట్లపై ప్రకృతి సాగు పద్దతిలో బొబ్బాయి, బంతి ఇతర మొక్కలను సాగు చేస్తే కలుపు నివారణతో పాటు ఆదాయ వనరుగుగా కూడ ఉపయోగిపడుతుందని
అన్నారు. ప్రకృతి సాగు పద్దతి ద్వారా 365 రోజులు పంటలు ఉండేలా చూడాలని అందుకు తగిన ప్రణాళిక సిద్దం చేసుకోవాలని కోరారు. ప్రకృతి ఇన్చార్జి నరసింహాం తదితరులు పాల్గొన్నారు.
