చిన్నారులతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలి – స్క్రీన్ నమయం పూర్తిగా దూరం చెయ్యాలి – సీడీపీఓ పరిమళ

చిన్నారులతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలని, చిన నాటి నుండే సెల్ ఫోన్లను అలవాటు చేసి వారి కంటి చూపు తగ్గ
టానికి కారణం కావద్దని తల్లిదండ్రులను ఐసి డీఎస్ దర్శి ప్రాజెక్టు సీడీపీఓ ఆర్ పరిమళ కోరారు. ముండ్లమూరు మండలం ఉలగల్లు లో గురువారం అంగన్ వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో బాగంగా “అంగన్ వాడీ కోసం సమాజ మద్దతు” అనే అంశంపై తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ మాట్లాడుతూ తల్లి, శిశు పోషణ పై అవగాహన కల్పించారు. రెండు సంవత్సరాల లోపు చిన్నారులకు మొదడు అభివృద్ధికి ప్రేరణ, ఆట ఆధారిత విద్య తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో వారి పాత్రపై అవగాహన కల్పించారు. లోకల్ గా దొరికే లో కాస్ట్ నో కాస్ట్ ఫుడ్ను వాడాలని, జింక్ ఫుడ్ చిన్నారులను దూరం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ లు ఇందిర, సునీత, సెక్టార్ అంగన్వాడీ టీచర్లు రాధాప్రియ, ప్రసన్నలక్ష్మి , విజయ లక్ష్మి, గాలేమ్మ, ఆరోగ్య ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *