నూపర్ ఎన్ నిలో సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు రైతులను, ప్రజలను అప్రమత్త తకు కు గ్రామస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని తహసీల్దార్ బివి రమణా రావు సూచించారు. తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎన్ నినో పై అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ నీటి విలువ తెలిపి నీటి అనర్ధాన్ని నివారించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ బోర్ల ద్వారా వరి సాగు చేయవద్దని, తక్కువ నీటితో సాగు చేసే పంటలకు సాగుచెయ్యాలని కోరారు. గ్రామస్థాయిలో వి ఆర్ ఓ, సెక్రటరీ, విఏఏలు సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, పశు వైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఎపీఎం దేవ రాజ్, ఎపీఓ కె వెంకటేశ్వర్లు, ఆర్ ఐ సుధీర్, ఆర్ డబ్ల్యు ఎస్ వాలి, ఎఈఓ లు నుబ్బా రెడ్డి, రాజ సుందరి, విఏఏ సాయిలు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు చెయ్యాలి ..
దారం వారి పాలెం, మన్నేపల్లి లలో పొలం పిలుస్తుంది నిర్వహించారు. ఎవో ప్రసాద రావు మాట్లాడుతూ నీటి కొరత కారణంగా ఆరు తడి పంటలు వేసుకోవాలని కోరారు. పంటల భీమా చేయించుకోవాలని కోరారు.

