యూపీఐ లావాదేవీలపై ఛార్జీల బాదుడును ఉపసంహరించుకోవాలి–సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్

సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (జే ఎస్ డి ఎం న్యూస్) :
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై తీసుకొచ్చిన కొత్త విధానాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట వాణిజ్య లావాదేవీలపై 0.4 శాతం మేర ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (ఎండీఆర్) విధించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు గళమెత్తాయి.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ మాట్లాడుతూ.. వ్యాపార యూపీఐ లావాదేవీలపై మోపిన ఈ అదనపు భారాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికాకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అగ్రరాజ్య ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం తలొగ్గిందని ఆయన ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాల పరిరక్షణలో ప్రధానికి దృఢచిత్తం కొరవడిందని విమర్శించారు.
యూపీఐ లావాదేవీలపై పన్ను విధించడం వల్ల చివరకు ఆ భారం వ్యాపారుల ద్వారా సామాన్య వినియోగదారులపైనే పడుతుందని, నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని దీపక్ జాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల జేబులకు చిల్లు పెట్టి విదేశీ శక్తులకు మేలు చేసేలా ఉన్న ఈ నూతన విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంపీ మల్లు రవితో పాటు డివిజన్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *