తూర్పుగంగవరంలోని యూనియన్ బ్యాంక్ ఎదురు బజార్లో ఏర్పాటు చేసిన వినాయకస్వామివిగ్రహం వద్ద లక్ష్మీగణపతిహోమం శుక్రవారం ఘనంగానిర్వహించారు. ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో పలువురు దంపతులు వినా యక స్వామికి లక్ష్మీగణపతి హోమంనిర్వహించారు. వేదపండితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆద్వర్యంలో అర్చుకులు శాస్ట్రోహక పూజలు, హోమ క్రతువు జరి పారు. గ్రామంలో గతంలో ఎన్నడూ జరుగని విధంగా వినాయక ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. లక్ష్మీగణపతి హోమంను తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. అనంతరం భక్తులకు భారీ అన్న దానం , ప్రసాద పంపిణీ కార్యక్రమం జరిపారు. ఈకార్యక్రమంలోఉత్సవకమిటీ సభ్యులు వైఎస్ఆర్ ప్రసాద్, సుందర లక్ష్మి దంపతులు, గ్రామ పెద్దలు తదిత రులు పాల్గొన్నారు .
