రైతులు తమ కృషితో పాటు శాస్త్రీయతను జోడిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉషారాణి తెలిపారు, మండలంలోని పెదఉల్లగళ్ళుగ్రామంలో శనివారం కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యార్థులు క్షేత్రీయ పర్యటనలో భాగంగా ఉల్లగల్లు గ్రామ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా దర్శి కృషి విజ్ఞాన శాస్త్రవేత్త ఉషారాణి ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి వ్యవసాయ విద్యార్థులతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటిని దృశ్య రూపంలో చూపించారు, అదే విధంగా గ్రామంలో రైతులు సాగు చేసిన పంటలను రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అవగాహన కల్పించారు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు రూపొందించిన పంటల శాతం బొమ్మ , కాలానుగున విశ్లేషణ, ఉల్లగల్లు గ్రామ చిత్రపటం, చెట్టు రేఖ చిత్రపట0 రైతులను ఆకట్టుకున్నాయి, ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ఉరియా మాలకొండయ్య. యు. చెన్న బసవ. జి సాయి తేజ. కే జస్వంత్. ఆర్ పర్రేజ్. టీ మెహిత్. రైతులు పాల్గొన్నారు.


