తాళ్లూరు మండలం లో ఆముదము పంటను సరైన సమయంలో కోయటం మరియు నూర్చటం చాలాముఖ్యమని అదే విధంగా కోత తర్వాత ఆర బెట్టంలో నిల్వలలో జాగ్రత్తలు వహించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. బొద్దికూరపాడు
పంచాయితీ పరధిలో సాగు చేసిన అముదం పంట నిల్వలను, కాయలను ఆయన సోమవారం. పరిశీలించారు. కోతల సమయంలో, కళ్లం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,మార్కేట్ ధరల పరిస్థితిని రైతులకు వివరించారు. విఏఏ అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.
ఆముదం పంట నిల్వలలో జాగ్రత్తలు వహించాలి
08
May