నో యాక్సిడెంట్ డే సందర్భంగా శనివారం ముండ్లమూరు ఎస్సై యువి. కృష్ణయ్య ఉల్లగల్లు గ్రామ సెంటర్లో మోటార్ సైకిల్, కారు వాహనదారులకు హెల్మెట్ ధరించాలని లైసెన్స్ కలిగి ఉండాలని అలాగే సీటు బెల్టు కంపల్సరిగా పెట్టుకోవాలని అతివేగంగా వెళ్లకూడదని రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించి అలాగే రోడ్ సేఫ్టీ కి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినారు. వివిధ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ముండ్లమూరు మండలంలో నో యాక్సిడెంట్ డే నిర్వహణ
08
Jul