విఘ్నాలు తొలగించి మహాగణపతి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని వైసీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ …గణనాథుడు చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని, ఆ మహా దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని నీ వేడుకుంటున్నాను అని తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ చింతా వెంకట శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
