వైకుంఠ ఏకాదశి సందర్బంగా మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శనివారం బల్కంపేట లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ని దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు అందజేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ EO నరేందర్ రెడ్డి, నాయకులు అశోక్ యాదవ్, ఉత్తమ్ కుమార్ సింగ్ రాజ్ పురోహిత్ తదితరులు ఉన్నారు.

