మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్ పేయి జయంతిని సందర్భంగా బిజేపి బిజెపి ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మోడల్ టౌన్, హౌసింగ్ బోర్డు కాలనీ జంక్షన్ సొంత శక్తి కేంద్రంలో జెండా ఆవిష్కరించి అటల్ చిత్ర పటాని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన సేసిన సేవలను, ఆయన గొప్పదనాన్ని వక్తలు కొనియాడారు.
జిల్లా అద్యక్షులు p.v. శివారెడ్డి గారు మాట్లడుతూ దేశప్రజలు మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బీహారీ వాజపేయి గారి సేవలను ఎన్నటికీ మర్చిపోలేరు అని కొనియాడారు. ఈ రోజు దేశము ఇంత అభివృద్ధి జరిగిందీ అంటే ఆయన చేసిన సుపరిపాలన కారణ మని కొనియాడారు. బిజెపి ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ య్య యాదవ్ మాట్లాడుతూ అటల్ బీహారీ వాజపేయి గారి జీవితం తెరిచిన పుస్తకంలాంటిదని . స్వతహాగాకవి. అపర మేధావి. దేశము లో జాతీయ రహదారుల రూపకర్త. ఈ దేశానికి మూడు సార్లు ప్రథాన మంత్రి గా విలువలతో కూడిన రాజకీయాలను చేసిన మహోన్నత వ్యక్తి అని. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించినా గాని పోక్రాన్ లో అణువిద్యుత్ కేంద్రాన్ని నెలగొల్పిన గొప్ప దేశభక్తుడు అని కొనియాడుతూ. ఒక్క పార్లమెంటు సభ్యుని ఓటు తేడాతో ప్రథాన మంత్రి పదవి నే తృణ ప్రాయంగా త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు అని కొనియాడారు. ఆయన లేని లోటును ఈ రోజు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి సేవ చేస్తూ ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నారు అని కొనియాడారు.
తదుపరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర మోహనరావు గారు మాట్లాడుతూ వాజపేయి గారు గొప్ప దేశభక్తుడు అని సూర్య చంద్రులు ఉన్నంత కాలం వాజపేయి గారు గుర్తుండిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి బిజెపి ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గెము శ్రీనివాసరావు. రెండవ మండల అద్యక్షులు A. సంజీవ కుమార్ యాదవ్ గారు. రాయపాటి అజయ్.I.సీతారామయ్య.A. అనిల్.p.దామోదర్. కాటా రాధాకృష్ణ మూర్తి.కొఠారి సుధాకర యాదవ్.p. తిరుమల.T.సత్యవతి. కృష్ణ వేణి. పూని లక్ష్మి.p. మధు యాదవ్. మిరియం శ్రీనివాసరావు యాదవ్.దని శెట్టి రాము. గుర్రం సత్యనారాయణ. గుఱ్ఱం రంగనాథ్. పెట్ లూరి ప్రసాదరావు. ఎస్వంత్. కొండయ్య.k. కోటేశ్వర రావు. శ్రీనివాసరావు.తదితరులు పాల్గొన్నారు

