ప్రకాశం జిల్లా, దర్శి నియోజక వర్గం, తాళ్లూరు మండలంలో తాళ్లూరులోని ఎబీసీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు జెండాను ఎగుర వేసారు. కెనరా బ్యాంకు మెనేజర్ ధర్మసాయి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధి కోసం పడుతున్న కష్టాలను గుర్తు చేసుకుని చక్కగా చదివి అభివృద్ధి చెందాలని కోరారు. ఆర్థిక క్రమశిక్షణ చిన నాటి నుండే అలవాటు చేసుకుని ఆర్ధిక స్వాతంత్య్రం సాధించే దిశగా కృషి చేసి దేశానికి ఉపయోగపడాలని కోరారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జాతీయ సమగ్రత ప్రతి పౌరుడు దేశ ప్రగతికి కృషి చెయ్యాలని కోరారు. నాడు స్వరాజ్య సాధనకు కృషి చేసారని, నేడు సురాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని దేశ ప్రగతిలో యువత ప్రాధాన్యత వెలకట్టలేనిదని కోరారు. ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ నాయకుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి చిననాటి నుండి లక్ష్యాలను ఏర్పరుచుకుని సాధనకు కృషి చెయ్యాలని అన్నారు. క్రమ శిక్షణలో పనిచేస్తే సాధ్యం కానిది లేదని అన్నారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవించి వారి ఆశయ సాధనకు కృషి చెయ్యాలని, గణ తంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. సమన్వయంతో పనిచేస్తే సాధించనది లేదని వివరించారు.
కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన “ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే ” అను అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలలో విజేతలైన విద్యార్ధులకు కెనరా బ్యాంకు మెనేజర్ ధర్మసాయి ఆధ్వర్యంలో బహుమతులు అందించారు. ఆటల పోటీలలో విజేతలైన వారికి బ్యాంకు మెనేజర్ ధర్మసాయి, కరస్పాండెంట్ టి. శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషాబాబులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు (ఎస్.ఏ)లు యలమందారావు, చిన్నయ్య, కొండల రావు, వెంకటరావు, స్వరూపరాణి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.





















