ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వైసిపి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. తాళ్లూరు మండలంలో లక్కవరం గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ -బూచేపల్లి కలిసి ప్రచారం చేశారు..
తూర్పు గంగవరంలో ఎన్నికల ప్రచారం…
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి నందిని ఎన్నికల ప్రచారం
నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసిపీ దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వైసిపి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.
ఆయా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, మండల, గ్రామ బాధ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సిఎం జగన్ కు స్వాగతం..
టంగుటూరులో ఎన్నికల ప్రచారా నికి విచ్చేసిన సిఎం జగన్ కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, దర్శి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్వాగతం పలికారు.



